కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉజ్వల 2.0 పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వాసుదేవ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ కవితా లక్ష్మీనారాయణ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కందుల మధు హాజరై లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ చేశారు. అనంతరం మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బత్తుల కృష్ణ ,నస్రత్, శ్రీను,ప్రసాద్,వాసుదేవ ఇండియన్ సిబ్బంది,పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్