కడప జిల్లా నందలూరు లో రైతు సమస్యల పై శనివారం టీడీపీ ఆధ్వర్యంలో రైతు అఖిలపక్షల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యం వహించారు. రైతులతో పాటూ జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
మొదట శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం లో పూజలు నిర్వహించిన బత్యాల చెంగల రాయుడు బాజా భజంత్రీల మధ్య పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, తన అనుచరులతో కలిసి పాదయాత్ర గా నందలూరు దళిత వాడలోని టీడీపీ యువనేత మోడ పోతుల రామ్మోహన్ ఇంటి ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో రైతు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు అత్యధిక ఆత్మహత్య లు చేసుకున్నారని ఆరోపించారు. పంట కోసం తెచ్చిన పురుగు మందులు పొలాలలోనే రైతులు తాగి చనిపోయారని అన్నారు.
పెట్టుబడి పెట్టిన రైతులు గిట్టు బాటు ధర రాక ఆత్మహత్య లు చేసుకున్నారన్నారు. జనసేన నేత యద్దల పవన్ బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లో రైతు పథకాలు వారి పార్టీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ రైతుల కోసం పోరాడితే ఈ ప్రభుత్వం దున్న పోతు మీద వర్షం కురిసి నట్టు స్పందించలేదన్నారు.రైతులు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి ఇడుపులపాయలో సంబరాలు చేసుకున్నారని అన్నారు.
బీజేపీ నేత విఠలాచార్యమాట్లాడుతూ సమీపంలో ని ఇసుకను పొలాల్లో కి తోలుకోవాలన్నా సవాలక్ష సమస్యలను వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తోందనిఆరోపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నేతలు ఎద్దుల సుబ్బారాయుడు, పల్లె సుబ్రహ్మణ్యం,జంగం శెట్టి సుబ్బయ్య,కొండ్రాతి గణపతి,
అఖిల భారత యాదవ మహా సభ కార్యదర్శి భారతాల శ్రీధర్ యాదవ్, శివ రామరాజు, సమ్మెట శివ,చుక్కా యనాది, ప్రవీణ్,మోడ పోతుల రాము,ఛామంచి పెంచలయ్య, పొత్తపి రమణయ్య,వాచ్ రిపేరువేణు, పి.యల్.నారాయణ, శివా తదితరులు పాల్గొన్నారు.