ప్రభుత్వం దేశం అభివృద్ది కి చర్యలు తీసుకోవాలి కానీ ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాదని అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేటి నుంచి వారు నిరాహారదీక్ష లు ప్రారంభించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఇప్పటికే అనేక ఆందోళన లు చేశామని, ఇకపై కూడా రాజీలేని పోరాటం చేస్తామని వారు అన్నారు. ఈ ఏడాదిలో విశాఖ స్టీల్ ప్లాంట్ 18 వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేసిందని, బ్యాంక్ ల వద్ద తీసుకున్న వడ్డీ కూడా చెలిస్తున్నామని వారు తెలిపారు.
ఇలాంటి లాభసాటి సంస్థను కేంద్ర ప్రభుత్వం మంకుపట్టుతో ప్రయివేటుపరం చేస్తున్నదని వారు తెలిపారు. విశాఖ స్టీల్ ను అమ్మే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని వారన్నారు.
దేశంలో ఉన్నటు వంటి జాతీయ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదని వారు వ్యాఖ్యానించారు. స్టీల్ పరిశ్రమ పరిరక్షణ కోసం ఈ నెల 4 న బీచ్ లో వాక్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.