తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు పుష్కర ఘాట్ దగ్గర పిండ ప్రధానం చేయించే పురోహితులు అందరూ దేవాదాయ శాఖ గుర్తింపు కార్డులు పొందవలసి ఉంటుంది.
ఇందుకోసం జోగులాంబ గద్వాల జిల్లా లోని జమ్మి చెడు జమ్ములమ్మ దేవస్థానం లో జూనియర్ అసిస్టెంట్ రవి ప్రకాష్ ను సంప్రదించాలని తుంగభద్ర పుష్కరాలు దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామకృష్ణ తెలిపారు.
ప్రతి పురోహితుడు మూడు పాస్ ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని అక్కడే దరఖాస్తు ఫారమ్ నింపి ఇవ్వవలసి ఉంటుందని తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ తెలిపారు.