Slider ఆధ్యాత్మికం

జోగులాంబ దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

#jogulambatemple

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నందు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం, ఆలంపూర్ యొక్క ఆధ్యాత్మిక/యాత్రా అవసరాలు, స్థిరమైన పర్యాటకాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రధాన ప్రణాళికపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జోగులాంబ దేవస్థానం అభివృద్ధి కొరకు ఏర్పాటైన పర్యవేక్షణ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలంపూర్ తెలంగాణలో ఏకైక శక్తిపీఠంగా ఉన్నందున, దీని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయ అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు,ఆలయ పరిసరాల అభివృద్ధి, మరియు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.

ప్రసాద్ పథకం భవనానికి నీటి సరఫర కోసం మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈ.ఈ,పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు నది నుంచి నీటి శుద్ధి విషయంపై ఫీల్డ్ విజిట్ నిర్వహించి,15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలన్నారు.  ప్రసాద్ పథకం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవదాయ శాఖకు అప్పగించాలని సూచించారు.  దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి గాంధీ జంక్షన్ నుండి ఆలయం వరకు రహదారి వివరాలు సిద్ధం చేయాలని,

మురుగునీటి కాలువ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. దేవాలయ పరిసర ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ను, భక్తులకు త్రాగునీటి సదుపాయంతో పాటు క్లాక్ రూమ్ ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్-కర్నూలు నుండి  ఆలంపూర్ మార్గాల్లో దిశానిర్దేశక బోర్డులు, నంది & శివ చత్రువుల్లో సూచికలు ఏర్పాటు చేయాలని, అలాగే బస్టాప్, ఆటోస్టాండ్ అభివృద్ధి, సైన్‌బోర్డులు, గోడలపై పెయింటింగ్ పనుల కోసం ఫీల్డ్ విజిట్ నిర్వహించి 15 రోజుల్లో లైన్ అంచనాలను సమర్పించాలని ఆర్అండ్‌బి శాఖకు ఆదేశించారు.

ప్రస్తుత పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు నాటి గ్రీనరీని పెంచాలని, టాయిలెట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ అధికారులకు ఆదేశించారు.ఆలయ పరిసరాల్లో శుభ్రత నిర్వహణ, పచ్చదనం పెంపొందించేందుకు వృక్షార్చన, చెట్లను నాటడం, పర్యావరణ అనుకూల అభివృద్ధి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.  ఆలయ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.  దేవాలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు శాఖల వారీగా వారం రోజులలో ప్రతిపాదనలను అందజేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు,  రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ రావు, అసిస్టెంట్ స్థాపతి గణేష్,ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, టెంపుల్ డిజైనర్ గోవింద హరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈ.ఓ పురేందర్,డిపిఓ నాగేంద్రం, అలంపూర్ తహసీల్దార్ మంజుల,మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్ రావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. వనజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీసీ రుణ సదుపాయంలో గౌడ్స్ కు స్థానం కల్పించాలి

mamatha

సీఎం జగన్ తో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే స్వామి భేటీ

Satyam NEWS

రాజకీయ కల్లోలంతో అధ:పాతాళానికి పాక్ ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!