రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ, 9 ఏళ్లు పూర్తి చేసుకుని, పదో ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సమీకృత కొత్త సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల స్మారక జ్యోతి, బీఆర్కేఆర్ భవన్ తో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చార్మినార్ తో పాటు ఇతర చారిత్రక కట్టడాకు విద్యుత్ దీపాలతో జిగేల్మంటూ దశాబ్ది ఉత్సవాల శోభతో కళకళలాడుతున్నాయి.
previous post