విజయనగరం జిల్లా కేంద్రంలో మూడు మున్సిపాలిటీలు ,ఒక కార్పోరేట్ తాలూకు కౌంటింగ్ ప్రకృయ ప్రారంభమైంది. ప్రారంభంలో బ్యాలెట్ బాక్స్ లను లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చారు.
ఈ మేరకు రాజీవ్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీ లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ లు ఇద్దరూ మీడియా మాట్లాడారు.
కౌంటర్ కేంద్రం మూడంచల భద్రత పెట్టామని ఎస్పీ తెలిపారు. ఓట్ల లెక్కింపు లో తమ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని…రౌండ్ కు ఎప్పటికప్పుడు ఫలితాలు.. ఎల్సీడీ ద్వారా అలాగే మీడియా కు అందజేస్తున్నామని కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తెలిపారు.