మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళుకు త్రికుటాతాద్రి ముస్తాబవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగడుగునా ఆధ్యాత్మికత కనిపించేలా కోటప్పకొండకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు భక్తి పారవశ్యంలో ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటీవలే శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదగా ఏకశిలా నంది విగ్రహన్ని ప్రతిష్టించగా ఇవాళ త్రికూటాద్రి అంతటా “ఓం నమః శివాయ” మంత్రం మార్మోగేలా ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ ను ప్రారంభించారు. సుమారు 15 లక్షల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సౌండ్ సిస్టమ్ భక్తుల్లో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించనుంది. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసా రావు, కొండ కావూరు సర్పంచ్ నాగిరెడ్డి, ఈఓ రామ కోటి రెడ్డి, పమిడిమర్రు సర్పంచ్ శ్రీనివాస రావు, ఎంపీటీసీ సేతు, కనకా పుల్లా రెడ్డి, మూరే రవీంద్ర రెడ్డి, జాన్, నాగార్జున, రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ఐ బాల నాగిరెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.