24.7 C
Hyderabad
March 29, 2024 07: 29 AM
Slider గుంటూరు

అన్ని ఆలయాలకు పూర్తి భద్రత కల్పిస్తాం

#Narasaraopet Police

ప్రస్తుతం రాష్ట్రం లో  ప్రార్ధన ఆలయాలపై  కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న నేపధ్యం లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండల, పట్టణ పరిధిలోని ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ను ఏర్పాటు చేస్తున్నామని డిఎస్ పి విజయభాస్కరరావు తెలిపారు.

శనివారం మండల పరిధిలోని కోటప్పకొండ వద్ద రూరల్ పోలీస్ అధికారులతో కలిసి ఆలయం వద్ద చేపట్టిన భద్రత చర్యలను పరిశీలించారు. ఆలయం వద్ద ఇంకా సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానంగా ఎవరు కనిపించిన పోలీస్ శాఖ వారికి తక్షణమే సమాచారం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

అలాగే పట్టణ పరిధిలోని మసీదు, చర్చ్, ఆలయాల వద్ద రాత్రి పూట భద్రత  ఏర్పాటు చేయాలని, అలాగే ఒకరి మనోభావాలు కించపరిచే విధంగా వారి దేవతలు, ఆలయాల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు.

పూర్తి సమాచారం లేకుండా అరకొర సమాచారం తో జరిగిన విషయం పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు పెట్టినా, సోషల్ మీడియా లో పెట్టినా అటువంటి  వ్యక్తుల పై కూడా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సి.ఐ అచ్చయ్య, ఎస్ ఐ రోశయ్య, బాలకృష్ణ సిబ్బంది  పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్

Related posts

అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

నియంత్రిత పంటల విధానంపై తీర్మానించిన తొలి గ్రామం

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

Satyam NEWS

Leave a Comment