28.2 C
Hyderabad
April 20, 2024 13: 13 PM
Slider కడప

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో దోపిడీకి తెరలేపారు…..

#varadarajulureddy

కడపజిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో దోపిడీకి తెరలేపారన్నారు.

ఎన్నికల్లో 20 కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్ళు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని గుత్తకు తీసుకున్నారని ఆరోపించారు.

అన్ని ప్రభుత్వ శాఖల ను గుప్పిట్లో పెట్టుకుని ఇస్తా రాజ్యాంగ పరిపాలన సాగిస్తున్నారన్నారు. పవిత్ర మైన, వేలాదిమంది కి ఉపయోగపడే మునిసిపల్ స్కూల్ మైదానంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం అన్నారు.

మార్కెట్లో వ్యాపారుల దగ్గర నుంచి ఎమ్మెల్యే అనుచరులు, ఆయన బావమరిది కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, పోలీసులు మొక్కుబడిగా అసాంఘిక కార్యకలాపాలపై కేసులు పెడుతున్నారన్నారు.

రాష్ట్రంలో కడపజిల్లా లో ప్రొద్దుటూరులో జరిగినంతగా అవినీతి, అక్రమాలు మరెక్కడా జరగలేదన్నారు.

Related posts

భారీగా హవాలా డబ్బు పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు

Satyam NEWS

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS

విజయకీలాద్రి పై ధనుర్మాస మహోత్సవాలు ఆరంభం

Satyam NEWS

Leave a Comment