సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి కొంత భావొద్వేగానికి అల్లు అర్జున్ లోనయ్యారని సమాచారం. డిసెంబరు 4న హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన తర్వాత, మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, అతని భద్రతా బృందం మరియు థియేటర్ నిర్వాహకులపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబరు 13న మహిళ మృతికి సంబంధించి నిందితుడు నంబర్ 11గా పేర్కొన్న అల్లు అర్జున్ను నగర పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ హైకోర్టు అదే రోజు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసి జైలు నుంచి విడుదలయ్యాడు. మరోసారి అల్లు అర్జున్ను ఇవాళ(మంగళవారం) విచారించారు. ఈ విచారణలో అల్లు అర్జున్పై పోలీసులు ప్రశ్నలవర్షం కురిపించారు. పోలీసుల విచారణలో ఓ వీడియో చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్ని పోలీసులు విచారించారు.
పోలీస్ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున అర్ధం కాలేదని సమాధానమిచ్చారని తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నారని సమాచారం మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్ చెప్పారు. పూర్తి విచారణను పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. విచారణ సమయంలో కేవలం మూడు సార్లు మాత్రమే అల్లు అర్జున్ వాటర్ తాగారు. తన వాహనంలో ఉన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, తిని అల్లు అర్జున్ టీ తాగారని సమాచారం.
డిసెంబర్ 4న ఇక్కడ ‘పుష్ప-2’ చిత్రీకరణ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన ఘటనకు సంబంధించి తెలుగు అగ్ర నటుడు అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసుల ఎదుట హాజరుకావాలని నటుడుకి నోటీసులు జారీ చేసింది. ఆయన నివాసంతో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను పెంచారు.
పోలీస్స్టేషన్కు వెళ్లే ముందు జనాల వైపు చేతులు ఊపాడు. స్టేషన్కు చేరుకునే రోడ్లపై ట్రాఫిక్పై పోలీసులు ఆంక్షలు విధించారు. విచారణకు సహకరిస్తానని అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ థియేటర్లో జరిగిన సంఘటనల క్రమాన్ని చూపించే వీడియోను విడుదల చేసిన ఒక రోజు తర్వాత నోటీసు వచ్చింది.