ప్రజల దీవెనలు అందుకొని అంబర్ పేట కార్పొరేటర్ గా ప్రజాక్షేత్రంలో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ను టీఆర్ఎస్ నేతలు సన్మానించారు. అంబర్పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగజోగి శ్రీనివాస్, ధరమ్, కాంత్, చేగురి రఘుబాబు, శ్రీనివాస్ గుప్తా నేడు ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, సంతోష్ చారి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట