30.7 C
Hyderabad
April 23, 2024 23: 22 PM
Slider ప్రకాశం

చంద్రబాబును కలిసిన ఆమంచి కృష్ణ మోహన్ ?

#amanchi krishnamohan

ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వారం రోజుల క్రితం హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడిని కలిశారు. 2024 సాధారణ ఎన్నికల లో ఈ విషయమై వారిరువురి మధ్య దాదాపు అరగంట చర్చ కొనసాగినట్లు తెలిసింది.

వచ్చే ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఆమంచి కృష్ణ మోహన్ స్వతహాగా తనకున్న ఓటు బ్యాంకు తో పాటు, చంద్రబాబు మద్దతు ద్వారా తెలుగుదేశం మద్దతు ఓట్లు, పవన్ కళ్యాణ్ ద్వారా జనసేన మద్దతు ఓట్లు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల సహకారంతో బిజెపి మద్దతు ఓట్లు కూడగట్టుకునే పనిలో లో ఆ మంచి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ సందర్భంగా… ప్రస్తుతానికి మౌనంగా ఉండమని, ఎన్ని కల సమయం లో మాట్లాడుకుందామని చంద్రబాబు ఆమంచికి సూచించినట్లు సమాచారం.

ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ద్వారా… చీరాలలో త్రిముఖ పోటీ ని సృష్టించి… కులం ప్రాతిపదికన ఓట్లను చీల్చడం ద్వారా తాను అత్యధిక ఓట్లు పొందాలనే వ్యూహంతో వచ్చే ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు గా ఆమంచి వ్యవహార శైలి స్పష్టం చేస్తోంది.

Related posts

AP News: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

కంటి వెలుగు విజయవంతం చేయాలి

Bhavani

బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ

Sub Editor

Leave a Comment