తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఆంధ్రాకు చెందిన అమర్ రాజా రూ. 9500 కోట్లతో మహబూబ్ నగర్ జిల్లా, దివిటిపల్లిలో లీథియం-ఇయాన్ గిగా యూనిట్ ను ఏర్పాటుచేయనున్నది. ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా ఇంత కాలం ఆంధ్రాలోనే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి KTR సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అమర రాజా సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారని, తెలంగాణకు ఇది ఒక చారిత్రక విజయమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ముందుగా హైదరాబాదులో అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని గల్లా జయదేవ్ తెలిపారు.