18.7 C
Hyderabad
January 23, 2025 03: 22 AM
Slider ముఖ్యంశాలు

సినీ హీరోలకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ధర్నా

amaravathi

రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్న సినీ నటులు అమరావతికి జరుగుతున్న అన్యాయం పై ఇప్పటి వరకూ మాట్లాడకపోవడం శోచనీయమని అమరావతి రైతులు అంటున్నారు. తెలుగు సినీ నటులు అమరావతికి అనుకూలంగా ఇప్పటికైనా ప్రకటన చేయాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు సినీ హీరోలు మొహంచాటేసి ముఖ్యమంత్రులకు భయపడుతూ కూర్చుంటున్నారని, దీనివల్ల వారి అభిమానులకు అన్యాయం జరుగుతున్నదని వారు అంటున్నారు. ఆస్తుల కోసం, సినిమా స్టూడియోలకు స్థలాల కోసం తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే పట్టింకోవడం మానేస్తారా అని వారు ప్రశ్నించారు. అమరావతి రైతులు నేడు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరం లేదని వారన్నారు.

Related posts

సామాజిక సేవలో పిఎస్ఆర్ ట్రస్ట్

mamatha

“ఆరుగురు ఆడపిల్లలు..ఓ అవిటి తండ్రి”కి న్యూస్ కు స్పందన

Satyam NEWS

దళిత విద్యార్ధి నల్లపు రమ్య హత్య అతి దారుణం

Satyam NEWS

Leave a Comment