28.2 C
Hyderabad
June 14, 2025 10: 14 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రొటెస్ట్: అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు

amaravathi

రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమ ఆందోళనలు ఉధృతం చేస్తూనే ఉన్నారు. రాజధాని రైతుల పోరు శుక్రవారానికి 38వ రోజుకు చేరుకుంది. నేడు మందడం, తుళ్లూరుల్లో రైతులు మహా ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో 34వ రోజు రైతు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ఆ ప్రాంతాలలో పూజలు చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతు నిరసనలు కొనసాగనున్నాయి. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

Related posts

బాలకృష్ణ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి

Satyam NEWS

ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

Satyam NEWS

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!