తమపై అసభ్య పదజాలంతో ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన కడప జిల్లా వాసిపై అమరావతి రాజధాని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వ్యక్తిగతంగా కించపరుస్తూ, తమపై అసభ్య పదజాలంతో కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోస్టింగులు పెట్టాడని వారు తెలిపారు.
ఈ మేరకు వారు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. రవీంద్రారెడ్డి పైనా, ఇటువంటి పోస్టులు పెట్టే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వారు వివరించారు. తమ మనోభావాలను కాపాడి తమ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని వారు పోలీసులను కోరారు.