టీడీపి ఎంపీ గల్లా జయదేవ్ ఆర్ధిక మూలాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం దెబ్బ కొట్టింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని సర్వే నెం 65/1 లో 253 ఎకరాలను గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్కు కేటాయించింది. వాటిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీఐఐసీ నుంచి గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్ఫ్రాకు 253 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు జీవో జారీ అయింది.