వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సుమారు 72వేల కోట్లుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ ప్రకటించాడు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాము ఏర్పాటు చేస్తున్న నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమించే శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ఎన్జీవోలు వాడుకోవచ్చని బేజోస్ తెలిపారు. అయితే అమెజాన్ సంస్థ వల్ల చాలా వరకు వ్యర్థాలు మిగిలిపోతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న నేపత్యం లో బెజోస్ ప్రకటన చర్చాయాంశమైంది.
previous post