బిచ్కుంద మండల కేంద్రంలోని కింది గల్లి గుర్రం వద్ద ఎంపిటిసి అవారి సురేష్ వేసవికాల దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు అంబలి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ బయట తిరగరాదని ఆయన అన్నారు. వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ పారిశుద్ధ్య పోలీస్ అధికారులు సేవలు మరువలేనివని వారి దహార్తిని తీర్చేందుకు అంబలి కేంద్రాలు ఎర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
వేసవి కాలం దృష్ట్యా అంబలి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి శ్రీహర్ష వ్యవసాయాధికారి పోచయ్య, ఎంపీడీవో ఆనంద్ ఎంపిటిసి చంద్రకళ రాజు, వార్డు సభ్యులు పత్తి లింగు రామ్ స్థానికులు హాజీ స్థాయిలో హాజీ అశోక్ మంగళి గంగాధర్ తదితరులున్నారు.