37.2 C
Hyderabad
March 29, 2024 18: 19 PM
Slider విజయనగరం

రాజ్యాంగాన్ని ఒక మ‌హాగ్రందంలా రూపొందించిన మ‌హ‌నీయుడు అంబేద్క‌ర్

#vijayanagaram

అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా విజయనగరం జిల్లా  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

రాజ్యాంగాన్ని ఒక మ‌హాగ్రందంలా రూపొందించిన మ‌హ‌నీయుడు అంబేద్క‌ర్  అని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ అన్నారు. అంబేద్క‌ర్ 131 వ జ‌యంతి సంద‌ర్బంగా స్తానిక బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద  ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల‌లు వేసిన అనంత‌రం ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌భ‌లో క‌లెక్ట‌ర్ పాల్గొని మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా ఆడిటోరియంలో అంబేద్క‌ర్ ఫోటోకు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ  స్పీక‌ర్ ,ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామితో పాటు క‌లెక్ట‌ర్ పూల‌దండ వేసి అంజ‌లి ఘ‌టించారు.ఈ సంద‌ర్బంగా  క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, దేశంలో ప‌రిపాల‌న‌కు దిశా నిర్ధేశం చేసిన ఘ‌న‌త అంబేద్క‌ర్‌కు ద‌క్కింద‌న్నారు. ఆయ‌న ఖ్యాతి చిర‌స్థాయిగా నిలిచిఉంటుంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌పంచ దేశాల్లోని వివిధ రాజ్యాంగాల నుంచి మంచి అంశాల‌ను గ్ర‌హించి, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించార‌ని కొనియాడారు.  ఒక మ‌హా గ్రంథంలా ఆయ‌న రాజ్యాంగాన్ని రూపొందించార‌ని కొనియాడారు.  గొప్ప వ్య‌క్తిగా రూపొందాలంటే, చ‌దువు మాత్ర‌మే ఏకైక మార్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అంబేద్క‌ర్‌ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు  చ‌దువుకొని వృద్దిలోకి రావాల‌ని కోరారు.

అంబేద్క‌ర్ జ‌న్మ‌దినం…దేశానికే ప‌ర్వ‌దినం: విజ‌య‌న‌గం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్

అంబేద్క‌ర్ జ‌న్మ‌దినం..దేశమంత‌టికి ప‌ర్వ‌దిన‌మని  విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్ల‌న చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. అంబేద్క‌ర్‌ ఏ ఒక్క కులానికో, వ‌ర్గానికో ప‌రిమితం కాద‌ని, ఆయ‌న అంద‌రివాడ‌ని అన్నారు. చ‌దువుద్వారా ఎంత‌టి ఉన్న‌త స్థానాన్నైనా సాధించ‌వ‌చ్చ‌న్న‌డానికి, అంబేద్క‌ర్ జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

చ‌దువు ద్వారానే అభివృద్ది సాధ్య‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంబేద్క‌ర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం జ‌గ‌న్  విద్య‌, ఉద్యోగాల్లో, ప‌ద‌వుల్లో ఎస్‌సి, ఎస్‌టిల‌కు పెద్ద‌పీట వేశార‌ని అన్నారు.రాష్ట్రంలో అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను సాధించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని అన్నారు.బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, అట్ట‌డుగు వ‌ర్గాల అభ్యున్న‌తే అంబేద్క‌ర్ ధ్యేయ‌మ‌ని, ఆ స్ఫూర్తి రాజ్యాంగంలో ఉంద‌ని అన్నారు.

బ‌లహీన వ‌ర్గాల అభ్య‌న్న‌తికి పాటుపడ్డ అంబేద్క‌ర్

బ‌లహీన వ‌ర్గాల అభ్యున్న‌తికి అంబేద్క‌ర్ ఎంతో పాటుప‌డ్డార‌ని కాబోతున్న డిప్యూటీ స్పీక‌ర్, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు.ఈ మేర‌కు స్థానిక ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో  అంబేద్క‌ర్ 131న జయంతి స‌భ‌కు ఆయ‌న అద్య‌క్ష‌త వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ, అంబేద్క‌ర్‌ దేశానికి దిశానిర్ధేశం చేసిన మ‌హ‌నీయుల‌ని కొనియాడారు. బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ఆయ‌న ఎంతో పాటుప‌డ్డార‌ని, మ‌న రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదేన‌ని పేర్కొన్నారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా దివంగ‌త సీఎం  వైఎసార్ పాల‌న‌ సాగించార‌ని,ఆయ‌న బాట‌లోనే ఆయ‌న కొడుకు జ‌గ‌న్  కూడా  న‌డుస్తున్నార‌ని అన్నారు.

మంత్రి ప‌ద‌వుల కేటాయింపులో కూడా, సీఎం ద‌ళితుల‌కు పెద్ద‌పీట వేశార‌ని చెప్పారు. ఒక ద‌ళిత మ‌హిళ‌ను రాష్ట్రానికి హోం మినిష్ట‌ర్‌ను చేయ‌డం, ఆయా వ‌ర్గాల‌పై సీఎంకున్న గౌర‌వానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఎంఎల్ఏ పేర్కొన్నారు.

Related posts

చంద్రబాబుకు హాని జరిగితే మా పార్టీని ప్రజలు తగలెట్టేస్తారు

Satyam NEWS

రిమ్స్‌లో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి

Satyam NEWS

19 నుంచి ఏపి శాసనసభ సమావేశాలు?

Satyam NEWS

Leave a Comment