31.7 C
Hyderabad
April 24, 2024 23: 39 PM
Slider నిజామాబాద్

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బురద జల్లడం మానుకోవాలి

#Ambadkarists

తెలంగాణ గురుకులాల నవ నిర్మాత, అభినవ అంబేద్కర్, లక్షలాది మంది పేద విద్యార్థుల ఆశాజ్యోతి అయిన అడిషనల్ డిజిపి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విషప్రాచారం ఆపాలని అంబేద్కర్ వాదులు డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గ్రామం లో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వాదులు, దళిత నాయకులు, స్వేరో లు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పెంజర్ల మహేందర్ రెడ్డి,  మోహన్ రెడ్డి లాంటి మత ఛాందసవాదులు చేస్తున్న అసత్య ఆరోపణలను వారు ఖండించారు.

ఈ సందర్భంగా దళిత నాయకులు మాజీ సర్పంచ్  నర్సింలు,  మన్నె సాయిలు, స్వేరో సర్కిల్ రాష్ట్ర నాయకులు కూడు గొల్ల రమేష్ కుమార్  మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు పేర్కొన్నారని అలాంటి గొప్ప వ్యక్తి పైన బురద జల్లడం అన్యాయమని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గమని, మరోమారు అసత్య ఆరోపణలు చేస్తే దళిత సంఘాల, గురుకుల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురికాక తప్పదని  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ వార్డు మెంబర్ నాగభూషణం,  అంబేద్కర్ సంగం అధ్యక్షులు రాజారాం, ఉపాధ్యక్షులు  బి సాయిలు, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల సాయిలు, మేతరి మల్లేష్, యూత్ నాయకులు అనిల్ మరియు గురుకుల తల్లిదండ్రులు, అంబేద్కర్ వాదులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

పాపం సమంత వర్రీ అవుతున్న అభిమానులు

Satyam NEWS

రాజంపేట టీడీపీలోకి వైసీపీ, జనసేన నేతల వలసలు

Satyam NEWS

కుకీ-మైతేయ్‌ విద్వేషం వెనుక..!

Satyam NEWS

Leave a Comment