హైదరాబాద్ అంబర్ పేట్ లోని ప్రతిష్టాత్మక అమ్మవారి దేవస్థానం సేవా సమితికి తక్షణమే కొత్త సభ్యత్వం ఇవ్వాలని అంబర్పేట్ ప్రజలు కోరుతున్నారు. కొత్త మెంబర్ షిప్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట సభ్యత్వం ఇచ్చారని, మళ్లీ ఇప్పటి వరకు చేయలేదని స్థానికుడు నరేందర్ ముదిరాజ్ తెలిపారు. అప్పుడు ఇప్పుడు అని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప కొత్త వారికి చోటు
కల్పించడం లేదని ఆయన అన్నారు. రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒక సారి కొత్త సభ్యతం ఇవ్వాలి అని సొసైటీ బైలాస్ లో ఉన్నదని, కాబట్టి వెంటనే సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త సభ్యతమిస్తే ప్రస్తుతం ఉన్న మేజేజింగ్ కమిటీ గెలిచి అవకాశం లేదనే కారణంతో, వారు ఉనికి కోల్పోతామని భయపడుతున్నారని ఆయన అన్నారు. గుడి దగ్గర ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకొని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంత మంది కొత్త వాళ్లకు కూడా సభ్యత్వం ఇచ్చి అమ్మవారి కి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నామని ఆయన అన్నారు.