అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ నేడు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ తీర్థప్రసాదాలు అందజేశారు. యాదగిరిగుట్ట మండలం రఘునాధపురం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్ ని కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దేశంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావ్, మహేష్ ముదిరాజ్, నరేష్, భూషణం, చారి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట