జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ నూతన సంవత్సరం సందర్భంగా కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోనా పూర్తిగా అంతరించిపోవాలని, ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని కోరుకున్ననని తెలిపారు. వారితో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో అంబర్ పేట్ డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, సంతోష్ చారి ఉన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట
previous post