భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన అంబర్ పేట్ డివిజన్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు పర్యటించారు. వర్షాలు తగ్గినందున అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
అంబర్ పేట్ డివిజన్ లో బాపు నగర్, చెన్నరెడ్డి నగర్ B, C బ్లాక్ లో ఆయన నేడు పాదయాత్ర చేశారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జీహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బందితో రోడ్లు, డ్రైనేజీ లైన్ లను డిస్టిల్ట్ చేయించి, దోమల నివారణ మందు కొట్టించారు. వర్ష బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాసిన్ షరీఫ్, విజయ్ కుమార్ గౌడ్, కాలేరు భరత్, సిద్దార్థ్ ముదిరాజ్, జాకీ బాబు, మల్లికార్జున్ యాదవ్, మహేష్, కాంతు, ధరమ్, నాగరాజు, విష్ణు, సాయి తదితరులు పాల్గొన్నారు.