బాగ్ అంబర్ పేట డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చుక్క జగన్ ఆధ్వర్యంలో అంబర్ పేట్ శ్రీ రమణ చౌరస్తా దగ్గర ఓటర్ జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేశారు.
ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన బర్కత్పూరా అంబర్పేట్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచనలతో మజ్లీస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని, ఒక వార్డులోని ఓట్లను, ఇంకొక వార్డులో కలిపేసి ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నారని, పౌరుల ఓటు హక్కులను కాలరాస్తు జీహెచ్ఎంసి ఎన్నికల్లో కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో చుక్క జగన్, C.కృష్ణ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సాంబ శివ గౌడ్, అచ్చి రమేష్, జి మల్లేష్, E. అజయ్ కుమార్, కె చంద్రశేఖర్, ఇమిడిరఘునందన్, సంజీవ్ కుమార్, భాస్కర్, నాగరాజు చారి, E. బాలకృష్ణ, రవీందర్ వంజరి, అనిల్ రామ్, శాతం సురేష్, కౌశిక్ గౌడ్, సునంద, కవిత, రామ్ నరసింహ, పాండు గౌడ్, నర్సింగ్ రావు, రాధాకృష్ణ రఘు, బాలాజీ నాయక్, గోవింద అర్జున్, ఎల్లయ్య, చిట్టి బాబు,D. రమేష్, సాయి టాకూర్, సరోజిని, కనక లక్ష్మి, పద్మజా, సరళ, శారద, వరలక్ష్మి, లక్ష్మణ్ గౌడ్, మధుసూదన్, సురేష్ గౌడ్, శ్రీదేవి, వీణ, ఎల్. శ్రీనివాస్, శివ కుమార్ ఇంకా అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.