రోడ్డు విస్తరణ పై వంతెన పనులు ఒకవైపు వేగవంతం చేస్తున్న ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూనే పెద్ద పెద్ద గుంతలతో నీరు నిలిచి రాక పోకలకు ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారి కావడంతో రోజూ భారీ వాహనాలతో కిక్కిరిసి పోతున్నది ఈ రోడ్డు. ద్విచక్ర వాహనాలపై రాకపోకలు చేస్తున్న వారికి గుంతలతో భయపడుతూ వాహనం నడుపాల్సి వస్తుందని ప్రయాణీకులు అంటున్నారు. నిన్న లక్మి. మొన్న సునిల్ అనే వారు గుంతలతో ఇబ్బందిపడి క్రింద పడిపోయారని స్థానికంగా నివసిస్తున్న ప్రజలు తెలిపారు. అధికారులు వాగ్దానాలకే పరిమితం అవుతున్నారన్నారని గత వారం స్థానిక ఎమ్మెల్యే వచ్చి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తున్నారని ఇప్పటికైనా వాహనదారులకు పెద్ద ప్రమాదం జరగక ముందే రోడ్డు పై నీరు నిలువకుండా మట్టితో భారీ గుంతలను పూడ్చి వేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్