బిచ్కుంద మండల కేంద్రంలోని ముప్పై పడకల ప్రభుత్వాసుపత్రికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు తన అభివృద్ధి నిధుల నుండి పదహారు లక్షల నిధులతో అంబులెన్స్ ను ఆస్పత్రికి అందజేశారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజల అనంతరం అంబులెన్స్ ను సంబంధిత పత్రాలను, తాళాలను ఆసుపత్రి వైద్యులు రవి రాజుకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హనుమంత్ సిండే లు అందజేశారు. పత్రిక మిత్రులకు హ్యాండ్ శానిటైజర్లను అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ప్రభుత్వ చర్యలకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు చేతిని శుభ్రంగా కడుక్కోవాలని సామాజిక దూరం పాటించాలన్నారు.
ఎవరికీ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోల బియ్యం పంపిణీ చేసిందన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా భారతదేశం నిలుస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కరొనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మన ముఖ్యమంత్రి ముందున్నారని ఆయన ముఖ్యమంత్రి తీరును గుర్తుచేశారు. అనంతరం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు జన్మదిన సందర్భంగా శాలువకప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆస్పత్రిలో ప్రసవించిన ఓ మహిళకు కెసిఆర్ కిట్టును అందించి ఆమెకు అందిస్తున్న వైద్య చికిత్సలు విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బిబి పాటిల్ తో పాటు ఎమ్మెల్యే హనుమంత్ సిండే, ఎంపిపి అశోక్ పటేల్, తహశీల్దార్ వెంకటరావు, ఎంపిడివో ఆనంద్ వ్యవసాయాధికారి పోచయ్య పాల్గొన్నారు.
ఎంపీవో మహబూబ్, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, మాజీ జడ్పీటిసి సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, ఎన్డీసీసీ బ్యాంకు డైరెక్టర్ రామ్ పటేల్, బిచ్కుంద నాయకులు నూకల రాజు పాషా సెట్, డాక్టర్ రాజు ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపిటిసిలు వైద్యులు రవిరాజా ఆరోగ్య బోధకులు దస్తీరా౦ సిబ్బంది ఉన్నారు.