గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ ( 108 – అత్యవసర ప్రతిస్పందన) అంబులెన్స్ సేవలను మంగళవారం నిర్మల్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబులెన్స్ సేవలను నిర్మల్ జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ స్ల్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన స్వంత నిధులతో రూ. 61.50 లక్షలతో 3 అంబులెన్స్ లను సమకూర్చారు. ఈ వాహనాల్లో ఆక్సీజన్, వెంటిలేటర్తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కె.విజయలక్ష్మి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిదులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.