అమెరికా లో వేర్వేరుగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.టెక్సాస్ యూనివర్సిటీ లో దుండగులు జరిపిన కాల్పులూ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రం గా గాయ పడ్డారు.టెక్సాస్ యూనివర్సిటీ లో ఏ &ఎం కామర్స్ కాంపస్ లో జరిగిన ఈ కాల్పుల వివారాలు తెలియాల్సి ఉంది.పోలీస్ లు అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.కాల్పులు జరిపింది ఎవరో ఇంకా తెలియలేదని తెలిపారు.
మరో కాల్పుల ఘటనలో లాస్ ఏంజెల్స్ నుండి శాంప్రాన్సిస్కో వెళుతున్న ఒక బస్సు లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 6 గురు తీవ్రం గాయపడ్డారని వారందరిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ లు తెలిపారు.హిల్ అనే పత్రిక కథనం ప్రకారం ఒక 52 సంవత్సరాల కొలంబియాన్ మహిళా కాల్పుల్లో చనిపోయినట్లు తెలిపారు.గాయపడ్డ అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాల్పులు జరిగిన సమయం లో బస్సు లో 41 మంది ఉన్నట్లు తెలిపారు.పోలీస్ బృందం అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది.