దేశం మొత్తంలో మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నారు. ఈ విషయాన్ని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించింది.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరడంతో ఆ మేరకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు అందించారు.
ఈ మొత్తం కేసుల్లో 58 పెండింగ్ కేసుల్లో జీవతఖైదు శిక్షలు విధించతగినవని అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని అమికస్ క్యూరీ తెలిపారు. మానవ వనరుల కొరత ప్రధాన సమస్యగా ఆయన పేర్కొన్నారు.