ఢిల్లీ జామియా కాల్పుల సంఘటన దురదృష్టకరమని,ఇలాంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వారికి కఠినం గా శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాల్పుల నేపథ్యంలో అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కాల్పులపై పోలీసు కమిషనర్తో మాట్లాడానని, ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించినట్టు అమిత్ షా తెలిపారు. అలాగే “ఇలాంటి సంఘటనలను కేంద్ర ప్రభుత్వం సహించదు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. అపరాధి తప్పించుకొనే ప్రసక్తే లేదు” అని అమిత్ షా ట్వీట్ చేశారు.
previous post