37.2 C
Hyderabad
March 29, 2024 18: 28 PM
Slider కర్నూలు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

#amith shah

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం (రేపు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు.

భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు దిల్లీకి బయలుదేరతారు.

Related posts

కాంగ్రెస్ కు వెనుపోటు పొడిచిన వ్యక్తి వై ఎస్ జగన్

Satyam NEWS

తిరుపతి ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అండ

Satyam NEWS

సంచలనాత్మక సంఘటనలు వెల్లడించనున్న ఎల్ వి సుబ్రహ్మణ్యం

Satyam NEWS

Leave a Comment