కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటన కు రానున్నారు. ఆయన మూడు రోజులపాటు తిరపతిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకూ ఖరారైన కార్యక్రమం ప్రకారం ఈనెల 13న తిరుపతికి అమిత్షా వస్తారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో అమిత్ షా పాల్గొంటారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అమిత్షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.