జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు బియ్యం అందజేసిన ఎఎస్ఆర్ చికెన్ సెంటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జనగామ స్థానిక చౌరస్తాలో ఉన్న నిరుపేద కుటుంబాలకు, వివర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ వద్దనున్న నిరుపేద కుటుంబాలకు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనగామ అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుడు తుంగ కౌశిక్, ఎర్రం శివ, తదితరులు పాల్గొన్నారు