అనంతపురం అర్బన్ లో నిర్మిస్తున్న టవర్ క్లాక్ బ్రిడ్జి, సుభాష్ రోడ్ లో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా కాంట్రాక్టర్ నిర్మిస్తున్న రోడ్డు మలుపులపై కూడా విచారణ జరపాలని వారు కలెక్టర్ ని కోరారు. కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారు.
అంతే కాకుండా విస్తరణలో తీసివేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. అనంతను ముంచేసిన వరద ముంపు బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.
సత్యంన్యూస్.నెట్, అనంతపురం