బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన దగ్గర ఉన్న వీడియోలను మరోమారు పరిశీలించుకోవాలని తాను కూడా నిన్న రాత్రి 2 గంటల వరకూ మైలార్దేవ్పల్లిలోనే ఉన్నానని పోలీసులపై నిరాధారణ ఆరోపణలు చేసే ముందు బండి వద్ద ఉన్న వీడియోలు ఒకసారి పరిశీలించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
న్యాయ నిపుణుల సలహా అనంతరం చట్టపరమైన చర్యలు
ఎన్నికలలో రోటిన్ చెకప్లో భాగంగా నిన్న రాత్రి మైలార్దేవ్పల్లిలో వాహనాల తనిఖీలు చేశామన్నారు. ఇక రూ. 40 లక్షల నగదు దొరికిందనే విషయంపై, ఆయా వీడియోలపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు ఎవ్వరికి వత్తాసు పలకడం లేదని అన్నారు. చట్టపరంగా తాము చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.