పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దారుణమైన సంఘటన జరిగింది. మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివశిస్తున్న ఒక 20 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భందాల్చింది. ఆ యువతికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అప్పటి నుంచి అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నది. ఎవరిని ప్రేమించిదో ఏమో తెలియదు కానీ పెళ్లి కాకుండానే గర్భందాల్చింది. నిన్న సాయంత్రం ఆమెకు డెలివరి అయింది.
పండంటి పాప పుట్టింది. అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆ యువతి తనకు పుట్టిన బిడ్డను ఎవరికి తెలియకుండా నీటిలో ముంచి చంపేసింది. సచివాలయం మహిళా పోలీస్, ఆశా వర్కర్ ఆమె ఇంటికి వెళ్ళగా ఇంటి బయట రక్తం పారడం గమనించారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ఆశా వర్కర్ తెలిపారు. హుటా హుటిన చిన్నారిని యువతినిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.