ఒక యువతి తనను మోసం చేసిందని మనస్తాపానికి గురైన యువకుడు ఒకరు కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం లోని అనంతపురం కొవ్వూరు నగర్ కు చెందిన ప్రణయ్ కెనడాలో ఉంటున్నాడు. అక్కడ అఖిల అనే యువతిని ప్రేమించాడు.
అయితే ఆమె తనను మోసం చేసిందని ప్రణయ్ మనస్తాపానికి గురయ్యాడు. నైట్రోజన్ గ్యాస్ పీల్చి అతను ఆత్మహత్య కు పాల్పడ్డాడు. దాంతో అనంతపురం లోని అతని కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొన్నది. ప్రణయ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రణయ్ తండ్రి నారాయణస్వామి అన్నారు.
ప్రేమ పేరుతో అఖిల తన కొడుకును మోసగించిందని, కరోనా నేపథ్యంలో పెళ్లి ఇప్పుడే వద్దంటూ మాయ చేసిందని ఆయన అన్నారు. అఖిల, ఆమె తల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రణయ్ తండ్రి నారాయణస్వామి కోరుతున్నారు. అఖిల అనే యువతి మోసం చేసిందని ప్రణయ్ సూసైడ్ వీడియో కూడా విడుదల చేశాడు