అనంతపురం పార్లమెంట్ సభ్యులు డా.తలారి.రంగయ్య నేడు అనంతపురం నగరంలోని 20 వ డివిజన్ పరిధిలోని బోయ వీధి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకున్నారు.
వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే బోయ వీధి లోని ప్రజలకు సంబంధించి ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లు, నగర పాలక సంస్థ అధికారులు,కార్పొరేటర్లు,వార్డ్ సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్.నెట్ అనంతపూర్