28.2 C
Hyderabad
April 20, 2024 12: 58 PM
Slider కడప

కడప నగరంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ల దగ్ధం

#kadapacity

సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా ఎల్లో మీడియా లో అసత్య కథనాలు ప్రచురిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలో ని ఏడు రోడ్ల సర్కిల్ నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లను దగ్ధం చేశారు. నిజాయితీ పరుడైన అవినాష్ రెడ్డి పై ఎల్లో మీడియా చెడు ప్రచారం చేస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మండిపడ్డారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు దిగారని అన్నారు. 2014 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినందును ఓర్వలేక టిడిపి అనుకూల మీడియా అసత్యపు కథనాలు రాస్తోందని ఆరోపించారు.

Related posts

Breaking News: ఏపిలో హిందూమతంపై దాడికి కేంద్ర బీజేపీ సీరియస్

Satyam NEWS

మణిపూర్ ఘటనపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోండి

Bhavani

శాల్యూట్: పెద్ద మనసు ఉన్న చిన్న కానిస్టేబుల్

Satyam NEWS

Leave a Comment