సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా ఎల్లో మీడియా లో అసత్య కథనాలు ప్రచురిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలో ని ఏడు రోడ్ల సర్కిల్ నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లను దగ్ధం చేశారు. నిజాయితీ పరుడైన అవినాష్ రెడ్డి పై ఎల్లో మీడియా చెడు ప్రచారం చేస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు దిగారని అన్నారు. 2014 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినందును ఓర్వలేక టిడిపి అనుకూల మీడియా అసత్యపు కథనాలు రాస్తోందని ఆరోపించారు.