28.7 C
Hyderabad
April 17, 2024 03: 33 AM
Slider గుంటూరు

మాఫియాల రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

#Yarapathineni Srinivasarao

ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే, రాష్ట్రం మాఫియా రాజ్యంలాగా తయారు కావటం కన్నా ఇంకోటి ఏముంటుందో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి భయపడి నోరు తెరిచే పరిస్థితి లేదని, అమరావతికి వ్యతిరేకంగా వారు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరందరికి శాశ్వత సమాధి ప్రజలు కడతారని ఆయన అన్నారు.

న్యాయపరంగా ఈ మూడు రాజధానులు బిల్లు నిలబడే సమస్యే లేదని, దీన్ని 5 కోట్ల ఆంధ్రుల తరపున తప్పకుండా పోరాడి, రాజధాని అమరావతిలో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు కూడా వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాజధానిని అమరావతి లోనే ఉంచుతామని, అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

రాజధానిని మార్చము అని చెప్పిన మీరు, ఈరోజు రాజధాని మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చిందో 5 కోట్ల ఆంధ్రులకు మీరు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.

Related posts

ఎమ్మెల్సీ అశోక్ బాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన చంద్రబాబు

Satyam NEWS

మాస్క్ లేకపోతే… వెయ్యి రూపాయలు జరిమానా

Satyam NEWS

రాహుల్ గాంధీని వ్యక్తిగత కక్షతో వేధిస్తున్న మోదీ

Satyam NEWS

Leave a Comment