Slider ఆంధ్రప్రదేశ్

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

y s jagan america

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు నేటి సాయంత్రం ఏపీ సీఎం జగన్  దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన దృష్ట్యా సిఎం  షెడ్యూల్ లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. సిఎం పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు. దేవాలయంలో సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. ఈ రోజు సాయంత్రం సిఎం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు

Related posts

కూటమి ఆధ్వర్యంలో ఏపికి ఇక మహర్దశ

Satyam NEWS

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

తుదిశ్వాస విడిచిన సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!