అమరావతి నుంచి రాజధానిని మార్చడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని ఇలాంటి విషయాల్లో తాము తప్పకుండా జోక్యం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల అంశం తదితర విషయాలపై రోజువారీ విచారణ జరుపుతున్న హైకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది.
వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు పరిపాలనా రాజధానిని.. విశాఖ పట్నానికి ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోలేదని అందువల్ల ఇలాంటి విషయాల్లో హైకోర్టు జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం ప్రకటించింది.