ఏ కే తెలుగు మీడియా ముంబై వారు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన కోన శ్రీనివాస రావుకు ఆంధ్ర సేవా రత్న అవార్డును బహూకరించారు.
నేడు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును బహూకరించారు.
కోన శ్రీనివాస రావు పశ్చిమ గోదావరి జిల్లా లో కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఏ కే తెలుగు మీడియా వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ కంటే ఈ అవార్డును అందచేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస రావు కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆహారం అందివ్వడం నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కోన శ్రీనివాసరావు కరోనా అనంతరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.