హన్మకొండ జిల్లా కు చెందిన అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి కన్సూమర్ ఎఫైర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా నామినేట్ అయ్యారు. ఆమె ఇప్పుడు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా కూడా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ పదవికి సరి అయిన న్యాయం చేస్తానని తెలిపారు. జిల్లా లో రేషన్ షాప్స్ లో వినియోగదారులు ఏ ఇబ్బందులు పడుతున్నా తన దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. మధ్యాహ్న భోజనం విషయంలో ఏవైనా ఫిర్యాదులు ఉంటే కూడా తనకు చెప్పవచ్చునని అనితారెడ్డి అన్నారు. తను నేరుగా కలిపి ఫిర్యాదు చేయవచ్చునని లేదా తన సెల్ నెంబర్ 9177362072 కు తెలియచేయవచ్చని అన్నారు. తనను విజిలెన్స్ కమిటీ మెంబర్ గా నామినేట్ చేసిన హన్మకొండ జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
previous post