30 సంవత్సరాలుగా ప్రజలకు తమ వంతుగా సేలు అందిస్తున్న అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సన్మానించింది.
ములుగులో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగ సంఘం బాధ్యులు దామోదర్ రెడ్డి, సారయ్య, విజయలక్ష్మి, కిష్టదాస్, తదితర నాయకులు పాల్గొన్నారు. అనాధలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు అనితా రెడ్డి అండగా ఉంటున్నారని, సొంత ఖర్చులతో గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ను కూడా ఈ సందర్భంగా సన్మానించారు.