జగనన్న తలచుకుంటే ఎవరికి ఏది కావాలన్నా ఇచ్చేయగలడు. ఒక్కటే షరతు… ఉద్యోగంలో ఉన్నంత కాలం తనకు అనుకూలంగా పని చేస్తే చాలు… అంతే… జగనన్న అంతకు మించి ఏమీ ఆశించడు. తన మనసు తెలుసుకుని మెసిలిన వారికి బతుకు బంగారం పండిస్తాడు జగనన్న. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన ఆదిత్యానాథ్ దాస్ కు సలహాదారుడి పదవి ఇచ్చి తన దాతృత్వాన్ని లోకానికి చాటి చెప్పిన జగనన్న ఇప్పుడు తాజాగా మరో ఉద్యోగి రిటైర్ కాగానే సలహాదారుడిగా పెట్టుకుని తన చేతికి ఎముకలేదని నిరూపించుకున్నాడు.
జగనన్న తన విధేయులకు చేస్తున్న పదవుల పందారం చూసి ప్రభుత్వ ఉద్యోగులు తమ వీర విధేయతను పోటీలు పడిమరీ చాటుకుంటున్నారు. తాజాగా మరో సలహాదారుడి పదవి దక్కించుకున్న అదృష్టవంతుడు ఏపిఎన్ జివోల నాయకుడు చంద్రశేఖరరెడ్డి. ఎపిఎన్జీవో ఆధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి దక్కబోతున్న ప్రతిఫలం.. సలహాదారుడు ఉద్యోగం… జీతం నెలకు నాలుగు లక్షల దాకా ఉండచ్చు…. ప్రభుత్వ ఉద్యోగులారా…. అంతా జగనన్నకు విధేయులుగా ఉండండి… తగిన ప్రతిఫలం పొందండి.