సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ బి ఐ బ్రాంచీలో పేరుకు ATM లు మూడు ఉన్నా ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. ఆ ఒక్కటి కూడా వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే పని చేస్తుందని, మిగతావి పూర్తిగా రిపేర్ లో ఉన్నాయని, అదనంగా ఎ టి ఎం ఏర్పాటు చేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి SBI బ్యాంక్ మేనేజర్ ను కోరి, వినతిపత్రం అందజేశారు.
హుజూర్ నగర్ లో SBI బ్యాంక్ మేనేజర్ మూర్తి వినతి పత్రం ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా హుజూర్ నగర్ లో చిన్న చిన్న బ్యాంక్ ఎటిఎం రెగ్యులర్గా పనిచేస్తున్నాయని, SBI పని చేయకపోవడం సరికాదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక తక్షణమే ఎ టి ఎం రిపేర్ చేసి అదనంగా కొత్త ATM పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరారు.
పట్టణంలో ఉద్యోగాలు, వివిధ రంగాల కాంట్రాక్ట్ కార్మికులు, వ్యాపారులు, రైతులు,వివిధ రంగాల వారు ఇబ్బందికి గురవుతారు కనుక కరోనా టైంలో ఒత్తిడి లేకుండా ఉండాలంటే అదనంగా మరొక ATM ఏర్పాటు చేయాలని కోరారు.
SBI మేనేజర్ త్వరలోనే పనిచేయని ATM మిషన్లను బాగు చేయిస్తామని, తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్య గౌడ్, రవి, తదితరులు పాల్గొన్నారు.